Sunday 22 February 2015

సౌతాఫ్రికా జట్టుకు జరిమానా

మెల్ బోర్న్: ప్రపంచ కప్ లో టీమిండియా చేతిలో ఘోరపరాజయం పాలైన దక్షిణాఫ్రికా జట్టుకు మరో దెబ్బ పడింది. ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవరేట్ తో బౌలింగ్ చేసినందుకు సఫారీలకు జరిమానా విధించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లు నిర్ణీత సమయానికి ఓ ఓవర్ తక్కువగా వేశారు. దీంతో సౌతాఫ్రికా కెప్టెన్ డివిల్లీర్స్ కు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం చొప్పున జరిమానా వేశారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లోపు దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవరేట్ తో బౌలింగ్ చేస్తే కెప్టెన్ డివిల్లీర్స్ ఓ మ్యాచ్ ఆడకుండా సస్పెండయ్యే ప్రమాదముంది.
 

No comments:

Post a Comment