Saturday 7 March 2015

క్రేజీ మల్టి స్టారర్ చిత్రం లో మహేష్

టాలీవుడ్ లో ఈ మద్య మల్టి స్టారర్ సినిమాల జోరు పెరిగింది. ఈ నేపద్యం లో ఈ తరహా సినిమాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా మరో క్రేజీ సినిమా పట్టాలు ఎక్కనుంది. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ , ఆర్యాలతో కలిసి మహేష్ బాబు నటిస్తాడని సమాచారం. లేటెస్ట్ గా జిల్లా సినిమాను రూపొందించిన దర్శకుడు నేషన్ దర్శకత్వం లో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే మహేష్ తో చర్చలు కూడా జరుగుతున్నాయి. భారిగా రూపొందే ఈ సినిమా తమిళ, తెలుగు బాషలలో ఉంటుందట. ఇప్పటికే మోహన్ లాల్ ఈ సినిమాకు గ్రెన్ సిగ్నల్  ఇచ్చాడని ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్త పివిపి నిర్మిస్తుందని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ క్రేజీ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment