Friday 6 February 2015

ఎన్టీఆర్ కి 29 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అంట ?















'బలుపు' వంటి సూపర్ హిట్ సినిమాను పీవీపీ బ్యానర్ లో నిర్మించిన ప్రసాద్ వి పొట్లూరి. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు నిర్మించాడు. కమల్ హాసన్, విక్రమ్, ఆర్య, సంతానం హీరోలుగా పొట్లూరి నిర్మించిన మూవీల్లో కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. టాలీవుడ్ లో బడా ఫైనాన్షియర్ గా చిత్రసీమలోకి ఎంటరై, నిర్మాతగా మారిన పొట్లూరి ప్రసాద్, తన అప్ మూవీలకి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమా ఘన విజయం సాధించగానే ప్రసాద్ ఆయనతో ఓ సినిమా తీయబోతున్నారనే వార్త హల్ చల్ చేసింది. అంతేకాదు... 'జనసేన' పార్టీ ఆవిర్భావ సభ, పొట్లూరి ప్రసాద్ నేతృత్వంలోనే జరిగిందని, దానికి ప్రతి ఫలంగా పవన్ ఓ సినిమా చేయడంతో పాటు... పార్లమెంట్ కూ ప్రసాద్ ను పంపడానికి సాయం చేస్తానని మాట ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ కారణాలు ఏవైనా... ఆ రెండు పనులు జరగలేదు. అలానే గత యేడాది తమిళ చిత్రం 'సూదుకవ్వం' రీమేక్ రైట్స్ కొని ఆ తర్వాత వాటిని రాజశేఖర్ కు ఇచ్చేశారు ప్రసాద్. అదే ఇప్పుడు 'గడ్డం గ్యాంగ్'గా రాబోతోంది. ఇక నాగార్జున, ఎన్టీఆర్ కాంబినేషన్ లోనూ ప్రసాద్ ఓ సినిమాను ప్లాన్ చేశారు. అయితే చివరకు ఆ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ప్లేస్ లోకి తమిళ హీరో కార్తీ వచ్చి చేరాడు.
     
ఈ విషయమై అధికారిక ప్రకటన ఇచ్చినా... ఈ సినిమా మాత్రం ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్ళలేదు. లేటెస్ట్ గా ఇదే సంస్థ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయబోతోందని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎన్టీఆర్ కి రెమ్యునరేషన్ గా, పి.వి.పి సంస్థ 29 కోట్ల రూపాయలు ఫిక్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

No comments:

Post a Comment